Gopichand: ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా సినిమా ‘విశ్వం’. స్టైలిష్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీనువైట్ల బ్లాక్బస్టర్స్కు పని చేసిన గోపీ మోహన్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాశారు. వి.కె.నరేశ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రగతి, అజయ్ ఘోష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న ఈ సినిమాను టీజర్ ను మంగళవారం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Gopichand Movie Updates
ఇక ట్రైలర్ విషయానికి వస్తే… ‘‘బంగినపల్లి పండు లాంటి మా పాపకు… కలెక్టర్ కాయ లాంటి కుర్రాణ్ని నువ్వే వెతికి పెట్టాలయ్యా’’ అంటూ నరేశ్ చెప్పే డైలాగ్ తో మొదలైన టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. టీజర్ లో అసలు కథపై స్పష్టత ఇవ్వకున్నా… ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి వినోదానికే పెద్ద పీట వేసినట్లు అర్థమవుతోంది. టీజర్ లో గోపీచంద్(Gopichand) పాత్రను వినోదాత్మకంగా పరిచయం చేసినా… ఆఖర్లో ఆయనలోని యాక్షన్ కోణాన్ని చూపించారు. ‘వెంకీ’ తరహాలో దీంట్లో ఓ ట్రైన్ సీక్వెన్ను సెట్ చేసినట్లు తెలుస్తోంది. ‘‘కొట్టారు.. తీసుకున్నాం. రేపు మాకు టైమ్ వస్తది. మేమూ కొడతాం’’ అంటూ ఆఖర్లో గోపీచంద్ చెప్పిన డైలాగ్ టీజర్కు ఆకర్షణగా నిలిచింది. గోపీచంద్, కావ్యా థాపర్ పాత్రల పరిచయం, వారి క్యారెక్టర్స్ లో కామెడీ స్పార్క్ ఆకట్టుకున్నాయి. టీజర్ లో ప్రముఖ నటీనటులతో కామెడీ సీన్స్ హిలేరియస్ గా వున్నాయి, టీజర్ చివరి భాగంలో యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అదిరిపోయాయి. ఎంటర్టైన్మెంట్,యాక్షన్ని ఎఫెక్టివ్గా బ్యాలెన్స్ చేస్తూ హైలీ ఎంటర్టైనింగ్ టీజర్ ని ప్రజెంట్ చేశారు శ్రీను వైట్ల.
గోపీచంద్(Gopichand) అల్ట్రా-స్టైలిష్గా కనిపించారు. తన ఇంటెన్సిటీతో కామెడీని బ్లెండ్ చేసే పాత్రలో మెరిశారు. కావ్య థాపర్ తన గ్లామర్తో ఆకట్టుకోగా, నరేష్, వెన్నెల కిషోర్, మిగతా నటులు వినోదాన్ని అందించారు. కెవి గుహన్ సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలిచింది, చైతన్ భరద్వాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథకు మరింత డెప్త్ ని జోడించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్ పై నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో వున్నాయి.
ఈ సందర్భంగా హీరో గోపీచంద్(Gopichand) మాట్లాడుతూ… “శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలని చాలా సంవత్సరాలుగా అనుకుంటున్నాను. ఏడాది క్రితం ఆయన్ని ఓ పార్టీలో కలవడం, సినిమా చేద్దామని అనుకోవడం, అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యింది. నేను చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశాను. శ్రీను వైట్ల గారు కంఫర్ట్ బుల్, హీరో డైరెక్టర్. హీరోని ఎలా చూపించాలనే కంప్లీట్ క్లారిటీ వున్న డైరెక్టర్. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని వుంది. ఒక మంచి ఎంటర్ టైనర్ చేయాలని అనుకున్నాను. ఇంత పెద్ద స్కేల్ లో ఆయన మార్క్ మిస్ అవ్వకుండా ఎవ్రీ ఫ్రేంలో నవ్వు వస్తునే వుంటుంది. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కావ్య చాలా బాగా చేసింది. చేతన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. గోపి మోహన్ నా లక్ష్యం, లౌక్యం తర్వాత మళ్ళీ ఈ సినిమాకి పని చేశారు. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశాం. ఈ సినిమా డెఫినెట్ గా మంచి హిట్ అవుతుందనే నమ్మకం వుంది’ అన్నారు
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ… ప్రేక్షకులు నా నుంచి ఏం కోరుకుంటారో మారుతున్న టైమ్ ని ద్రుష్టిలో పెట్టుకొని ఒక ఫ్రెష్ థీమ్, చాలా లేయర్స్ తో ప్రాపర్ బ్లెండ్ తో చేసిన కమర్షియల్ సినిమా ఇది. వేణు దోనేపూడి గారితో సినిమా స్టార్ట్ అయ్యింది. తర్వాత విశ్వగారు స్ట్రాంగ్ సపోర్ట్ గా వచ్చారు. వారికి థాంక్ యూ. అవుట్ పుట్ చూసి అందరూ హ్యాపీగా వున్నారు. నాకు సపోర్ట్ గోపి గారికి థాంక్ యూ. కావ్య థాపర్ ఎనర్జిటిక్ గా చేసింది. చాలా పెద్ద స్కేల్ వున్న ఫిలిం ఇది. నా గత సినిమాలకి మించి ఇందులో హిలేరియస్ కామెడీ వుంటుంది. దసరాకి ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేశాలా వుంటుంది. చేతన్ ఈ సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇటలీ రొమ్ మిలాన్ సర్జినియా గోవా హిమాచల్ ప్రదేశ్ .. ఇలా చాలా ప్లేసస్ లో షూట్ చేశాం” అని అన్నారు.
Also Read : Ram Charan: ‘కల్కి’ నిర్మాతలకు రామ్చరణ్ సర్ప్రైజ్ ! థాంక్స్ చెప్పిన స్వప్నదత్ !