Director Nelson: నిర్మాతగా మారిన ‘జైలర్’ డైరెక్టర్ నెల్సన్ !

నిర్మాతగా మారిన 'జైలర్' డైరెక్టర్ నెల్సన్ !

Hello Telugu - Director Nelson

Director Nelson: దర్శకులు నిర్మాతలుగా మారడం అన్నది ప్రస్తుతం సినీ పరిశ్రమలో సర్వ సాధారణం అయిపోయింది. ఎంతో మంది దర్శకులు… ఇటీవల కాలంలో నిర్మాతలుగా మారి ఏకంగా ప్రొడక్షన్ హౌస్ లనే నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ లో సుకుమార్, త్రివిక్రమ్ లు నిర్మాతలుగా మారగా కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూడా ఇటీవల ‘జీ స్క్వాడ్’ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేశాడు. అయితే ఇప్పుడు లోకేష్ కనకరాజ్ బాటలో ‘జైలర్‌’ ఫేమ్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కూడా నిర్మాత అయిపోయాడు.

Director Nelson As a Producer

రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘జైలర్‌’. రజనీకాంత్ సినిమా కెరియర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా ‘జైలర్‌’ నిలిచిపోయింది. అయితే ‘జైలర్‌’ తరువాత రజనీకాంత్… ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వేట్టయాన్ ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కాని డైరెక్టర్ నెల్సన్(Director Nelson) మాత్రం తన నెక్ట్స్ ప్రాజెక్టు అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

అయితే దర్శకుడిగా నెల్సన్ గ్యాప్ తీసుకుంటున్నప్పటికీ నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. తన శిష్యుడు శివ బాలన్‌‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నెల్సన్ ఓ సినిమా తీస్తున్నాడు. లేడీ ఓరియంటెడ్‌ కథతో తీస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ లీడ్ రోల్ చేస్తోంది. గతంలో నెల్సన్ తీసిన ఫస్ట్ మూవీ ‘డాక్టర్’లో ప్రియాంకనే హీరోయిన్. సో తన లక్కీ హీరోయిన్‌తోనే నెల్సన్… తొలి చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాలో ప్రియాంక సరసన కవిన్‌ హీరోగా నటిస్తున్నాడు. ఎస్‌జే సూర్య కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

Also Read : Hanuman: డిసెంబరు 19న ‘హను-మాన్’ థియేట్రికల్ ట్రైలర్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com