‘కేసీఆర్’ సినిమాలో పాటను విడుదల చేసిన మాజీ సీఎం కేసీఆర్ !
జబర్దస్త్ ఫేం రాకింగ్ రాకేశ్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమావత్). ఈ సినిమాకు ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహిస్తున్నారు. ‘పదగతులు స్వరజతులు పల్లవించిన నేల… తేనె తీయని వీణ రాగాల తెలంగాణ .’ అంటూ సాగే ఈ సినిమాలోని తెలంగాణ తేజం పాటని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. గోరటి వెంకన్న రచించిన ఈ పాటకి, చరణ్ అర్జున్ స్వరాలు సమకూర్చారు. మను కల్పన, గోరటి వెంకన్న కలిసి ఆలపించారు. పాట బాగుందని చిత్రబృందాన్ని అభినందించారు కేసీఆర్. ఈ కార్యక్రమంలో దీవకొండ దామోదర్రావు, బోయినపల్లి వినోద్కుమార్, జోగినపల్లి సంతోష్కుమార్, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, రాఘవ, చరణ్ అర్జున్, జోర్దార్ సుజాత, విహ, సంజయ్ మహేశ్ తదితర రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.