Chiru Vishwambhara : చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. దీనిపై అందరూ హర్షం వ్యక్తం చేస్తుంటే, చిరు కంటే అర్హులైన వారు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది ఉన్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏమైనా, అతనికి అవార్డు రావటంపై కొందరు అక్కసు వెళ్లగక్కుతున్నారు. మరోవైపు చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నారు.
Chiru Vishwambhara Movie Updates
చిరంజీవి గత ఏడాది ‘వాల్తేరు వీరయ్య’తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత “భోళా శంకర్” ఒక మలుపు తిరిగింది. ఈ చిత్రం అతి పెద్ద డిజాస్టర్గా నిలిచి అందరి అంచనాలను తలకిందులు చేసింది. మొత్తంమీద చిరు కెరీర్లో ఒక మచ్చగా మిగిలిపోయింది. అయితే తన తదుపరి చిత్రాలపై శ్రద్ధ పెట్టాడు. ఈ నేపథ్యంలో నూతన దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర(Vishwambhara) చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి ముందు ముల్లోక వీరుడు అనే టైటిల్ అనుకున్నారు. కానీ చివరికి ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ నిలిచిపోయింది.
ఈ చిత్రంలో చిరు సరసన త్రిషతో పాటు మరో ఇద్దరు భామలు నటిస్తున్నారు. మరోవైపు మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్కుమార్ నటించనున్నట్లు సమాచారం. ఇక యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి. అంజి సినిమాల తర్వాత ప్రధాన పాత్ర పోషిస్తున్న సోషియో ఫిక్షన్ సినిమా కావడం గమనార్హం. ఈ చిత్రంలో తమిళ హీరో శింబు చిరును డికొట్టే విలన్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ముందే కథ వినిపించారని, చిరు సరసన ఈ సినిమాలో నటించాలని అనుకుంటున్నారని సమాచారం.
ఈ మధ్య కాలంలో చిరు తన సినిమాల్లో ఇతర హీరోలకు లీడ్ రోల్స్ ఇస్తున్నాడు. సైరా నరసింహా రెడ్డి ఇతర పాత్రల్లో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, రవికిషన్ నటించారు. అటు ఆచార్యలో రామ్ చరణ్ నటించారు. ఆ తర్వాత సత్యదేవ్ ది గాడ్ ఫాదర్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. రవితేజ వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తే, సుశాంత్ భోళా శంకర్ సినిమాలో నటించాడు. ఇప్పుడు తాజాగా ‘విశ్వంభర(Vishwambhara)’ చిత్రంలో శింబు చిరు కథానాయకుడిగా నటిస్తారని సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. యూవీ క్రియేషన్ బ్యానర్పై ఈ చిత్రం రూపొందుతోంది. ఘరానా మొగుడు, ఆపద్భాందవుడి, ఎస్పీ పరశురాం వంటి చిత్రాల తర్వాత కీరవాణి చిరు సంగీతం అందిస్తున్నారు.
Also Read : Akhanda Sequel : అఖండ సీక్వెల్ లో బాలయ్యను ఢీకొట్టే విలన్ రోల్ లో బాలీవుడ్ హీరో