Chiranjeevi Welcomes : మెగాస్టార్ ని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కన్నడ స్టార్

బెంగుళూరు నుంచి వచ్చిన శివన్నకు చిరంజీవి ప్రత్యేకంగా లంచ్ ఏర్పాటు చేశారు

Chiranjeevi Welcomes : కళామ్మతల్లి సినిమాకు చేసిన సేవలకు గాను మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన చిరుకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంటికి వెళ్లి ఆయనను శుభాకాంక్షలు తేలిపేరు. ఆదివారం (ఫిబ్రవరి 4) తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలిపారు. బెంగళూరులో ఉంటున్న శివన్న హైదరాబాద్ వచ్చి చిరంజీవిని కలిశారు. పద్మవిభూషణ్ అవార్డు గెలుచుకున్నందుకు అభినందనలు.

బెంగుళూరు నుంచి వచ్చిన శివన్నకు చిరంజీవి ప్రత్యేకంగా లంచ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్(Chiranjeevi) శివన్నతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. “నా ప్రియమైన స్నేహితుడు శివన్న నా కోసం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కలిసి భోజనం చేశాం. మేము చాలా సేపు మాట్లాడుకున్నాము. దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు తన కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాం. చాలా జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాం’’ అంటూ చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Chiranjeevi Welcomes Kannada Super Star

చిరంజీవి, శివన్నల మధ్యాహ్న భోజన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చూసిన అభిమానులు, నెటిజన్లు చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే… చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నాడు. సోషల్ ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. పూజ కార్యక్రమాల షూటింగ్ ఇటీవలే అధికారికంగా ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ కూడా ముగిసింది. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటించే అవకాశం కనిపిస్తోంది.

Also Read : Ambajipeta Marriage Band : భారీ వసూళ్లతో ట్రెండింగ్ లో ఉన్న సుహాస్ సినిమా

ChiranjeeviMeetingsTrendingUpdatesViral
Comments (0)
Add Comment