Chiranjeevi : ‘విశ్వంభర’ సినిమా అనంతరం మరో సినిమాకి సిద్దమవుతున్న చిరు

గతంలో మోహన్ రాజా, చిరంజీవి "ది గాడ్ ఫాదర్" సినిమా విడుదలైంది....

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంబర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సోషల్ ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీవసిష్ఠ దర్శకత్వంలో యువీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి ఏ దర్శకుడితో కలిసి పని చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. చాలా మంది స్టార్ డైరెక్టర్స్ ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని చిరంజీవి మళ్లీ దర్శకుడు మోహన్ రాజాతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.

Chiranjeevi Movies Update

గతంలో మోహన్ రాజా, చిరంజీవి(Chiranjeevi) “ది గాడ్ ఫాదర్” సినిమా విడుదలైంది. లూసిఫర్‌కి రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే ఇప్పుడు మోహన్ రాజా చెప్పిన కథ చిరంజీవికి బాగా నచ్చిందట. అందుకే ముందుగా ఈ ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం మోహన్ రాజా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్టు సమాచారం. మారుతీ దర్శకత్వంలో చిరంజీవి ఓ చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. హరీష్ శంకర్ మూవీ ఎప్పుడు టేకాఫ్ అవుతాయో చూడాలి.

Also Read : Shruti Haasan : తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ పై కీలక వ్యాఖ్యలు చేసిన శృతి హాసన్

Comments (0)
Add Comment