Sai Durgha Tej : మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ స్ట్రాంగ్ కంటెంట్ సబ్జెక్ట్లను ఎంచుకుంటూ వరుస సూపర్ హిట్స్తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ‘ విరూపాక్ష’, ‘బ్రో’ విజయాల తర్వాత సాయి దుర్గ తేజ్(Sai Durgha Tej).. రోహిత్ కెపి దర్శకుడిగా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను చేస్తున్నారు. ‘ హనుమాన్’ వంటి సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత.. నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను హై బడ్జెట్తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ని మేకర్స్ తెలియజేశారు.
Sai Durgha Tej Movie Updates
ఆ వివరాల్లోకి వెళితే.. SDT18 టీం ప్రముఖ ఫైట్ మాస్టర్స్ కొరియోగ్రాఫ్ చేసిన 15 రోజుల యాక్షన్-ప్యాక్డ్ షెడ్యూల్ పూర్తి చేసింది. మునుపెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్లలో సాయి దుర్గ తేజ్ పవర్ ఫుల్ మాస్ అవతార్లో ఇందులో కనిపించనున్నారు. హై-ఆక్టేన్ స్టంట్స్, డైనమిక్ ఫైట్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాయని మేకర్స్ చెబుతున్నారు. హై బడ్జెట్తో భారీ స్థాయిలో టాప్ ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమాని తెరకెక్కుతోంది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో మ్యాసీవ్ సెట్ సిద్ధమవుతోందని.. హై స్కేల్, ఇంటెన్సిటీతో SDT18 గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోందని మేకర్స్ ఈ అప్డేట్లో తెలిపారు. ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా మూవీ విడుదల కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.
Also Read : Prakash Raj : తిరుమల లడ్డు వివాదంపై పవన్ కళ్యాణ్ ట్వీట్ కి కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్