Amitabh Bachchan: ప్రఖ్యాత గాయని, నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. దీనానాథ్ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ముంబైలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉషా మంగేష్కర్ చేతుల మీదుగా అమితాబ్ ఈ అవార్డును స్వీకరించారు.
Amitabh Bachchan Award
ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ… లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని స్వీకరించడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ‘‘ఇలాంటి పురస్కారాన్ని స్వీకరించేందుకు నేను అర్హుడినని ఏనాడూ భావించలేదు. హృదయనాథ్ పదేపదే కోరడంతో నేను ఇక్కడకు వచ్చాను. గతేడాది కూడా నన్ను అవార్డు ప్రదానోత్సవానికి ఆహ్వానించారు’’ అని అమితాబ్ చెప్పారు. భారతీయ సంగీత రంగానికి అందించిన సేవలకుగాను ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ను ఇదే కార్యక్రమంలో మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ పురస్కారంతో సత్కరించారు.
Also Read : Sardar 2 : కార్తీ ‘సర్దార్ 2’ కు సన్నాహాలు !